చెంగాళమ్మ సేవలో వాణిశ్రీ

vanisri visited Chengallamma temple - Sakshi

సూళ్లూరుపేట: ప్రముఖ సినీనటీ, నాటితరం కథానాయిక వాణిశ్రీ సోమవారం సూళ్లూరుపేటలో చెంగాళమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయం వద్ద పాలక మండలి చైర్మన్‌ ముప్పాళ్ల వెంకటేశ్వరరెడ్డి ఆహ్వానం పలికి, అమ్మవారి వద్ద పూజలు చేయించారు.

అనంతరం ఆమెను ఆలయ మర్యాదలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మే 31 నుంచి జూన్‌ 6 వరకూ జరుగనున్న చెంగాళమ్మ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా చైర్మన్‌ ముప్పాళ్ల వాణిశ్రీని ఆహ్వానించారు. కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు ఆకుతోట రమేష్‌ పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top