ఇంద్రవెల్లి, న్యూస్లైన్ :
ఎస్సీ, ఎస్టీ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా విడుదల చేసిన సబ్ప్లాన్ నిధుల వినియోగంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇతర కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నారని కపాడ్స్ డెరైక్టర్ ఎం.అమృత్ విమర్శించారు. శనివా రం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కమిటీలు ఏర్పాటు చేసి నిధుల ఖర్చుపై ఉద్యమిస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ గ్రామాల్లో, గూడేల్లో రోడ్లు, తాగునీటి సౌకర్యం, విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, ఇళ్ల నిర్మా ణం చేపట్టాల్సి ఉండగా.. అధికారులు నిధులు ఖర్చు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని అన్నారు. సబ్ప్లాన్ చట్టం చేసి తొమ్మిది నెలలు గడుస్తున్నా ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీలకే నిధులు దక్కే విధంగా ఉద్యమిస్తామని తెలిపారు. ఈ నెల ఆరున మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో మండల కమిటీని ఎన్నుకుంటామని ప్ర కటించారు. పార్టీలు, సంస్థలకు అతీతంగా నా యకులు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ ఉట్నూర్ అధ్యక్షుడు కాటం రమేశ్, నాయకులు సింగరే భారత్, పేందోర్ జైవంత్రావు, ఆర్.శ్యామ్నాయక్, సోమోరే నాగోరావు, గంగన్న, కాంతరావు, ఉత్తమ్ పాల్గొన్నారు.
ఆదిలాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం
ఎదులాపురం : సెంటర్ ఫర్ అకాడమీ ఎండ్ పీపుల్స్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం ఆదిలాబాద్లోని అంబేద్కర్ భవనంలో శనివారం జరిగింది. ఈ సందర్భంగా సొసైటీ డెరైక్టర్ ఎం.అమృత్రావు, ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇస్లామొద్దీన్ మాట్లాడారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ పరిరక్షణ ఆదిలాబాద్ డివిజన్ కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ కన్వీనర్గా మోతె బారిక్రావు, కో కన్వీనర్లుగా ఉయిక సంజీవ్, గౌతం మునీశ్వర్, సభ్యులుగా మెస్రం రాజేశ్వర్, వసంత్పవార్, మర్సుకోల బాపురావు, రాథోడ్ సాగర్, మెస్రం జలేంధర్ ఎన్నికయ్యారు. అన్ని మండలాల్లో కమిటీని విస్తరించాలని తీర్మానించారు.
సబ్ప్లాన్ నిధుల వినియోగంపై నిర్లక్ష్యం
Published Sun, Jan 5 2014 5:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్లో పలువురి చేరిక
చిరు జల్లులతో ఉపశమనం
మత్స ్య సంపద ౖపైపెకి..
దాబా పైనుంచి పడి యువకుడి దుర్మరణం
నేటినుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు
ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
పీఆర్సీ వేతన సవరణ అంశాలపై వివరణ
ఇండియా కూటమిని గెలిపించాలి
వారికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం..
ఎన్నికలప్పుడే గుర్తొస్తాయి!
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement