గవర్నర్‌ అధ్యక్షతన వీసీల సదస్సు | university vice chancellors conference in andhra university | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ అధ్యక్షతన వీసీల సదస్సు

Jan 24 2018 3:46 PM | Updated on Apr 6 2019 9:11 PM

ఆంధ్ర యూనివర్సిటీలో బుధవారం యూనివర్సిటీ వీసీల సదస్సు నిర్వహించారు.

సాక్షి, విశాఖ: ఆంధ్ర యూనివర్సిటీలో బుధవారం యూనివర్సిటీ వీసీల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు గవర్నర్‌ నరసింహన్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌ మాట్లాడుతూ ఏపీలోని అధ్యాపకులు, విద్యార్థుల కోసం బయెమెట్రిక్‌ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్టు తెలిపారు. అదే విధంగా విద్యాలయాల్లో ర్యాగింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో ఉన్నత విద్యారంగంలో విశ్వవిద్యాలయాల విజన్‌, ర్యాంకులు మెరుగు పరుచుకోవడానికి అనుసరిస్తున్న విధానాలు, బయోమెట్రిక్‌ విధానం అమలు- ప్రగతి, అనుబంధ కళాశాలల వెబ్‌సైట్‌లను వర్సిటీ వెబ్‌ సైట్‌లతో అనుసంధానించడం, ప్రాజెక్టులు, నిధులు సాధించే విధానాలు, నూతన విశ్వ విద్యాలయాలకు అందించిన క్యాపిటల్‌ ఫండ్‌ను ఖర్చు చేస్తున్న విధానం, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ప్లేస్‌మెంట్‌ విధానం తదితర విషయాలను ఈ సదస్సులో చర్చించారు. ఈ సదస్సుకు 16 యూనివర్సిటీల వీసీలతో పాటు ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆదిత్యనాధ్‌దాస్‌, మండలి చైర్మన్‌ చైర్మన్‌ విజయనంద్‌, వైస్‌ చైర్మన్‌ వల్లీకుమారిలు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement