సింగపూర్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ విశాఖపట్నంలో ఓ వ్యక్తి నిరుద్యోగులకు మోసం చేశాడు.
విశాఖపట్నం: సింగపూర్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ విశాఖపట్నంలో ఓ వ్యక్తి నిరుద్యోగులకు మోసం చేశాడు. శంకర్ దాస్ అనే వ్యక్తి ఈ మోసానికి పాల్పడ్డాడు. నిరుద్యోగుల నుంచి రూ. 30 లక్షలు వసూలు చేసి అతడు పరారయ్యాడు.
బాధితులు గోపాలపట్నం పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఒక్కొరి దగ్గర రూ. 2 లక్షలు వసూలు చేసినట్టు బాధితులు చెప్పారు. తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.