ఇంట్లో నిద్రిస్తున్న దంపతులపై దాడి చేసి భార్యపై అత్యాచారా యత్నానికి పాల్పడ్డారు.
నిద్రిస్తున్న దంపతులపై దాడి.. భార్యపై అత్యాచారయత్నం
Jul 10 2017 8:19 AM | Updated on Jul 28 2018 8:53 PM
విశాఖపట్నం: జిల్లాలో గుర్తు తెలియని దుండగలు దారుణానికి ఒడిగట్టారు. ఇంట్లో నిద్రిస్తున్న దంపతులపై దాడి చేసి భార్యపై అత్యాచారా యత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన పెదగంట్యాడ మండలం అప్పికొండలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దంపతులు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన ముగ్గురు దుండగులు భర్తపై దాడి చేసి భార్యపై అత్యాచారయత్నం చేశారు.
ఆమె గట్టిగా కేకలు వేయడంతో ముగ్గురు దుండగులు పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
Advertisement
Advertisement