ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో ఓ ఇంటర్ విద్యార్ధి దుర్మరణం చెందాడు.
యలమంచిలి: ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో ఓ యువకుడు మృతిచెందిన సంఘటన విశాఖ జిల్లా యలమంచిలి మండలం తెరువుపల్లి గ్రామం వద్ద ఆదివారం చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి తెరపల్లి శివ (17) అక్కడికక్కడే మృతిచెందగా మరో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను విశాక కేజీహెచ్ కు తరలించారు. గాయపడిన గేదెల నాగేశ్, కట్టమూరి శివాజీలది రాంబిల్లి గ్రామంగా గుర్తించారు.