విశాఖ జిల్లాలో ఇద్దరు విద్యార్ధినుల అదృశ్యం | Two girl students go missing from Visakapatnam | Sakshi
Sakshi News home page

విశాఖ జిల్లాలో ఇద్దరు విద్యార్ధినుల అదృశ్యం

Nov 26 2013 10:32 PM | Updated on Sep 2 2017 1:00 AM

జిల్లాలోని ఎన్ఎడి జంక్షన్‌లోని చైతన్య కాలేజీకి చెందిన ఇద్దరు విద్యార్ధినులు అదృశ్యమైన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

విశాఖపట్నం: జిల్లాలోని ఎన్ఎడి జంక్షన్‌లోని చైతన్య కాలేజీకి చెందిన ఇద్దరు విద్యార్ధినులు అదృశ్యమైన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కాలేజీకి వెళ్లిన వారిద్దరూ ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్ధినుల ఆచూకి కోసం బంధువులను, స్నేహితులను  ఆ విద్యార్ధినుల తల్లిదండ్రులు ఆరా తీశారు.

 

అయినా వారి ఆచూకి లభించకపోవడంతో చివరికి వారు గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విద్యార్ధినుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement