void వరంగల్ సిటీ, న్యూస్లైన్ : తెలంగాణ ఉద్యోగులు మరోమారు ఉద్యమ గళం ఎత్తేందుకు సిద్ధమయ్యారు. ఉద్యోగుల సమస్యలతోపాటు పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలనే
వరంగల్ సిటీ, న్యూస్లైన్ : తెలంగాణ ఉద్యోగులు మరోమారు ఉద్యమ గళం ఎత్తేందుకు సిద్ధమయ్యారు. ఉద్యోగుల సమస్యలతోపాటు పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలనే డిమాండ్తో గురువారం హన్మకొండ ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించనున్న ఉద్యోగ గర్జనకు టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసా ద్, ప్రధాన కార్యదర్శి కారం రవిందర్రెడ్డి హాజరవుతున్నారు. ఇప్పటికే ఉద్యోగల సమస్యలపై జిల్లా వ్యాప్తంగా మండల, డివిజన్ స్థాయిలో సదస్సులు నిర్వహించా రు. జిల్లా కేంద్రంలో ఉద్యోగులను సమీకరించి పోరాటాన్ని తీవ్రం చేయాలని భావిస్తున్నారు. ఈ నెల 29న హైదరాబాద్లో జరిగే సకల జనభేరి సభకు ఉద్యోగు లు తరలివెళ్లే అంశంపై ఈ సభలో చర్చించనున్నారు. మహిళా ఉద్యోగ ఫోరం నేత రేచల్, రాష్ట్రనాయకులు ప్రతాప్, జిల్లా ఉద్యోగ జేఏసీ చైర్మన్ పరిటాల సుబ్బారావుతోపాటు జిల్లా నాయకులు హాజరయ్యే ఈ సభకు ఉద్యోగులు సకాలంలో వచ్చి విజయవంతం చేయాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు కోలా రాజేష్కుమార్ కోరారు.