ప్రకాశం జిల్లాలో విషాదం | three children dead after drowning in a pond | Sakshi
Sakshi News home page

ప్రకాశం జిల్లాలో విషాదం

Sep 9 2017 1:01 PM | Updated on Sep 12 2017 2:22 AM

ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.

బల్లికురవ: ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లిన చిన్నారులు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందారు. జిల్లాలోని బల్లికురవ మండలం నక్కబొక్కలపాడు గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు గ్రామ శివారులోని నీటికుంటలో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు నీటి కుంటలో గాలింపు చేపట్టగా.. ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభించాయి.. మరో బాలుడి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement