
మందు బాబులకు ముప్పు
జిల్లాలో అక్రమ, నకిలీ మద్యం అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖలోని కొందరు అధికారుల అండతోనే ఈ దందా సాగుతున్నట్లు విమర్శలున్నాయి.
సాక్షి ప్రతినిధి, అనంతపురం : జిల్లాలో అక్రమ, నకిలీ మద్యం అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖలోని కొందరు అధికారుల అండతోనే ఈ దందా సాగుతున్నట్లు విమర్శలున్నాయి. దీనిబారిన పడి మందు బాబుల ఆరోగ్యం గుల్లవుతోంది. సర్కారు ఖాజానాకు కూడా భారీగా గండిపడుతోంది. పేరుమోసిన కొందరు మద్యం వ్యాపారులతో పాటు అధికార పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య నేతల కనుసన్నల్లో ఈ దందా సాగుతోంది.
వ్యాపారులకు అధికార పార్టీ అండ ఉండడం, తమకూ కాసుల పంట పండుతుండడంతో ఆబ్కారీ అధికారులు.. ప్రజల ఆరోగ్యం, సర్కారు ఆదాయాన్ని గాలి కొదిలేశారు. అక్రమ వ్యాపారానికి జై కొడుతున్నారు. ‘అనంత’లోని దుకాణాలకు కర్ణాటక నుంచి అక్రమ మద్యం రవాణా అవుతున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. కర్ణాటక సరిహద్దు మండలాలైన కుందుర్పి, కంబదూరు, శెట్టూరు, బొమ్మనహాళ్, డీ హీరేహాళ్, గుమ్మఘట్ట, చిలమత్తూరు, రొద్దం, విడపనకల్లు, మడకశిర, అగళి, అమరాపురం, గుడిబండ, రొళ్ల మీదుగా జిల్లాలోకి కర్ణాటక మద్యం ప్రవేశిస్తోంది. ఈ పరిధిలోని చెక్పోస్టు అధికారులతో పాటు ఎక్సైజ్ అధికారులు అక్రమ రవాణాకు అనధికారిక అనుమతి ఇచ్చేశారు.
ఆర్ఎస్ బేస్డ్ లిక్కర్తో భారీ లాభాలు
రాష్ట్రంలోని మద్యం ఎక్ట్రా నూట్రల్ ఆల్కహాల్ (ఈఎన్ఏ)తో తయారవుతోంది. అదే కర్ణాటకలో రెక్టిఫై స్పిరిట్ (ఆర్ఎస్)తో తయారు చేస్తున్నారు. ఈఎన్ఏ లిక్కర్ డబుల్ఫిల్టర్ కాగా.. ఆర్ఎస్ సింగిల్ ఫిల్టర్. ఈఎన్ఏ లీటర్ రూ.42-45 ఉంటే.. ఆర్ఎస్ రూ.28-30కే మందు బాబులకు ముప్పు
లభిస్తుంది. ఈ నేపథ్యంలో కర్ణాటక మద్యం ఆంధ్రా కంటే తక్కువ ధరకే దొరుకుతోంది. ఛీప్ లిక్కర్ 180 ఎం.ఎల్ క్వార్టరు బాటి ళ్లు ఒక్కో కేసులో 48 ఉంటాయి. ఒక్కో క్వార్టర్ బాటిల్ ధర మార్కెట్లో రూ.45 ఉంది. ఛీప్ లిక్కర్ కంటే కొంచెం మెరుగ్గా ఉండే డిప్ 90 ఎం.ఎల్ బాటిళ్లు ఒక్కో కేసులో 96 ఉంటాయి. ఒక్కో డిప్ బాటిల్ విలువ రూ.55. కర్ణాటకకు చెందిన ఛీప్, డిప్ రకాలు ‘అనంత’కు చేరుతున్నాయి.
ఇవి మద్యం వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. జిల్లాలో నెలకు సగటున రూ.75 కోట్ల మద్యం అమ్మకాలు సాగితే, అందులో కర్ణాటక మద్యం వాటా రూ.7-9 కోట్ల వరకు ఉంటోంది. ఈ లెక్కన ఏటా రూ.84 కోట్ల నుంచి రూ.108 కోట్ల అక్రమ మద్యం జిల్లాలో అమ్ముడవుతోంది. పైగా జిల్లాలో మద్యం విక్రయాలు ఎమ్మార్పీ కంటే రూ.10-15 అధికంగా సాగుతున్నాయి. దీనివల్ల వ్యాపారులకు మరింత లాభం చేకూరుతోంది.
ఆబ్కారీ కనుసన్నల్లోనే..
హిందూపురం, కొత్త చెరువుతో పాటు పలు ప్రాంతాల్లోని దుకాణాల్లో కర్ణాటక మద్యం చాలాసార్లు అధికారుల కంట పడింది. ఓబిరెడ్డి అనే వ్యాపారి గతేడాది అక్టోబరులో 250 లీటర్ల కర్ణాటక మద్యం రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. అప్పట్లో అతనితో పాటు కొన్ని దుకాణాల నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. అయినా అక్రమ దందా ఆగలేదు. కర్ణాటక మద్యం విక్రయాలు జరిగే దుకాణాలపై దాడులు చేయకుండా ఉండేందుకు ప్రతినెలా ఒక్కో దుకాణం నుంచి రూ.10-15 వేలు అధికారులకు ముట్టజెబుతున్నట్లు ఆరోపణలున్నాయి. కర్ణాటక లేబుళ్లను మార్చి వ్యాపారులు మద్యం విక్రయిస్తున్నారు.
ఇది మరో రకం కల్తీ
బేవరేజెస్ నుంచి తెచ్చుకునేది మొదటి రకం. ఇది మన వైన్షాపుల్లో విక్రయిస్తారు. ఇతర రాష్ట్రాల్లో చవకగా వస్తుందని మన రాష్ట్రంలో పన్ను ఎగ్గొట్టి కొనుగోలు చేసి విక్రయించే సరుకు రెండో రకం. దీన్ని ‘సెకండ్స్’అంటారు. ఎలాంటి ఎక్సైజ్ డ్యూటీ చెల్లించకుండా స్పిరిట్, అవసరమైన పదార్థాలతో సొంతంగా తయారు చేసి విక్రయించేది మూడో రకం(థర్డ్). జిల్లాలో ఈ రకం విక్రయాలు కూడా జోరందుకుంటున్నాయి. కర్ణాటక నుంచి తెచ్చే మద్యాన్ని బేసిన్లు, టబ్లలో పోసి నీళ్లు, రంగు, స్పిరిట్ కలిపి మద్యం సీసాల్లో నింపి అమ్ముతున్నారు.
కాగా, నకిలీ మద్యంపై ఫిర్యాదు చేయడానికి బాధితులు జంకుతున్నారు. ఫిర్యాదు చేస్తే వైన్ షాపు యజమాని నుంచి తీవ్ర ఇక్కట్లు ఎదురయ్యే ప్రమాదం ఉందని భయపడుతున్నారు.త్వరలోనే కేసు నమోదు చేస్తాం: జీవన్ సింగ్, డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్కర్ణాటక మద్యం విక్రయిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. వ్యాపారుల పేర్లు కూడా తెలిశాయి. నిఘా పెట్టాం. వారిని త్వరలోనే పట్టుకుంటాం. దుకాణాల్లో స్టాకు వివరాలు తీసుకుంటున్నాం. గతేడాదితో పోల్చితే స్టాకు తగ్గితే.. అందుకు గల కారణాలపై ఆరా తీస్తున్నాం. ఉన్న మద్యాన్ని తనిఖీ చేస్తున్నాం.
కర్ణాటక మద్యం విక్రయించే దుకాణాలపై కేసులు నమోదు చేశాం. నకిలీ మద్యం తయారీ విషయం కూడా మా దృష్టికి వచ్చింది. దీనిపైనా రెండు కేసులు నమోదు చేశాం. సిబ్బంది పాత్రపై విచారిస్తాం. అక్రమ, నకిలీ మద్యం వ్యాపారాన్ని ప్రోత్సహించే ప్రసక్తే లేదు. కఠిన చర్యలు తీసుకుంటాం. ఆన్లైన్ బిల్లులు వస్తే అన్నింటికీ చెక్ పడుతుంది.
నకిలీ మద్యంతోప్రాణాపాయం
నకిలీ మద్యం మనిషిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మద్యంలో కల్తీ స్థారుుని బట్టి మెదడు,
లివర్, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. క్రమేణా ఆ సమస్య పెరిగి పెద్దదవుతుంది. కల్తీ తీవ్రత అధికమైతే కంటిచూపు పోవడంతో పాటు పిచ్చిపిచ్చిగా ప్రవర్తించి కోమాలోకి పోయే ప్రమాదముంది. ఏ క్షణంలోనైనా ప్రాణాలు కూడా పోవచ్చు. ఛీప్, నకిలీ మద్యం కారణంగా చాలా మందికి లివర్ సమస్యలు పెరుగుతున్నారుు. మద్యపానమే హానికరం. అలాంటిది ఛీప్, నకిలీ మద్యం సేవిస్తే ముప్పు తప్పదు.
- డాక్టర్ శివకుమార్, సర్వజనాస్పత్రి, అనంతపురం