కలుషిత ఆహారం తిని విద్యార్థిని మృతి | The student was found dead after eating the contaminated food | Sakshi
Sakshi News home page

కలుషిత ఆహారం తిని విద్యార్థిని మృతి

Mar 24 2016 1:17 PM | Updated on Oct 5 2018 6:48 PM

కలుషిత భోజనం తిని ఆస్పత్రి పాలైన 12 మంది విద్యార్థుల్లో ఓ బాలిక మృతిచెందింది.

కలుషిత భోజనం తిని ఆస్పత్రి పాలైన 12 మంది విద్యార్థుల్లో ఓ బాలిక మృతిచెందింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా పరిగి మండలం కొడిగినహళ్లిలో గురువారం వెలుగుచూసింది. స్థానికంగా ఉన్న పద్మసాయి కోచింగ్ సెంటర్ ఏపీఆర్జేసీ పరీక్ష కోసం 85 మంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం వారిని హిందూపురం ఆస్పత్రికి తరలించారు. అందులో నిఖిత(8) అనే విద్యార్థిని మృతిచెందింది. కాగా.. నిర్వాహకులు మాత్రం వడ దెబ్బ వల్లే విద్యార్థిని మృతిచెందిందని అంటున్నారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement