రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | The person killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Oct 9 2014 12:17 AM | Updated on Sep 2 2017 2:32 PM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఇబ్రహీంపట్నం (కృష్ణా): మండలంలోని గుంటుపల్లి గ్రామం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటనలో అతడి భార్యకు స్వల్పంగా గాయాలయ్యాయి.

ఇబ్రహీంపట్నం (కృష్ణా): మండలంలోని గుంటుపల్లి గ్రామం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటనలో అతడి భార్యకు స్వల్పంగా గాయాలయ్యాయి. వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడి గ్రామానికి చెందిన వాతా శ్రీనివాసరావు(50), హనుమాయమ్మ(48) దంపతులు మోటార్‌సైకిల్‌పై ఇబ్రహీంపట్నం ఫెర్రి గ్రామానికి బయలుదేరారు. గుంటుపల్లి వద్ద వీరి వాహనం అదుపుతప్పి ఆగి ఉన్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో దంపతులు కింద పడిపోయారు.

శ్రీనివాసరావు తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మరణించాడు. హనుమాయమ్మకు స్వల్పంగా గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలికి వచ్చి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


 అల్లుడి ఇంటికి వస్తూ...
 శ్రీనివాసరావు దంపతులు ఫెర్రిలో నివాసం ఉంటున్న తమ అల్లుడు బుర్రి సత్యనారాయణ ఇంటికి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. కళ్లెదుటే భర్త చనిపోవడంతో హనుమాయమ్మ కన్నీరుమున్నీరైంది. ప్రమాదం గురించి తెలియగానే బంధువులు హుటాహుటిన ఘటనాస్థలికి వచ్చారు. వ్యవసాయదారుడైన శ్రీనివాసరావుకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement