అసెంబ్లీని కుదిపేసిన లీకేజి వ్యవహారం | tenth paper leakage issue creates ruccus in ap assembly, opposition demands discussion | Sakshi
Sakshi News home page

అసెంబ్లీని కుదిపేసిన లీకేజి వ్యవహారం

Mar 28 2017 10:30 AM | Updated on Jul 25 2018 4:42 PM

అసెంబ్లీని కుదిపేసిన లీకేజి వ్యవహారం - Sakshi

అసెంబ్లీని కుదిపేసిన లీకేజి వ్యవహారం

పదోతరగతి ప్రశ్నపత్రాల లీకేజి వ్యవహారం ఏపీ అసెంబ్లీని కుదిపేసింది. మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణలను బర్తరఫ్ చేయాలంటూ వైఎస్ఆర్‌సీపీ డిమాండ్ చేసింది.

పదోతరగతి ప్రశ్నపత్రాల లీకేజి వ్యవహారం ఏపీ అసెంబ్లీని కుదిపేసింది. మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణలను బర్తరఫ్ చేయాలంటూ వైఎస్ఆర్‌సీపీ డిమాండ్ చేసింది. ఉదయమే ప్రశ్నపత్రాల లీకేజి వ్యవహారంపై అత్యవసరంగా చర్చించేందుకు మంగళవారం వాయిదా తీర్మానం ఇవ్వగా, దాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు.

ముందుగా ప్రశ్నోత్తరాల సమయం చేపడదామని, ఆ తర్వాత వేరే ఫార్మాట్‌లో దానిపై చర్చిద్దామని అన్నారు. కానీ ఇది చాలా అత్యవసరమైన విషయం కాబట్టి దీనిపై వెంటనే చర్చించాలని ప్రతిపక్షం డిమాండ్ చేసింది. నెల్లూరులోని నారాయణ స్కూలు సెంటర్‌ నుంచే పదో తరగతి ప్రశ్నపత్రం లీకైనట్లుగా డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇచ్చిన నివేదికను ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సభలో బయటపెట్టారు. అందులో స్పష్టంగా 4238 నారాయణ స్కూలు సెంటర్‌లో పేపర్ లీకైనట్లు ఉందని, దాని ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇది చాలా ముఖ్యమైన అంశమని, అందువల్ల దానిపై చర్చించాలని ప్రతిపక్ష సభ్యులంతా డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. లీకేజిల ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ మండిపడ్డారు. అయితే ప్రతిపక్ష సభ్యులను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు దీనిపై నోటికి వచ్చినట్లల్లా మాట్లాడారు. ఇదే సందర్భంలో టీడీపీ ఎమ్మెల్యే ఆదిత్య అయితే పూర్తిగా సంయమనం కోల్పోయి ప్రతిపక్ష సభ్యులను దెయ్యాలు, పిశాచులు అటూ వ్యాఖ్యానించారు. దానిపై వైఎస్ఆర్‌సీపీ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement