నిరసన ర్యాలీలు విరమించుకోండి: మంత్రులు | Telangana ministers appeal to call off stir against | Sakshi
Sakshi News home page

నిరసన ర్యాలీలు విరమించుకోండి: మంత్రులు

Aug 23 2013 2:04 PM | Updated on Sep 1 2017 10:03 PM

సీమాంధ్ర ఉద్యోగులు నిరసన ర్యాలీలు విరమించుకోవాలని తెలంగాణ ప్రాంత మంత్రులు కోరారు.

హైదరాబాద్ : సీమాంధ్ర ఉద్యోగులు నిరసన ర్యాలీలు విరమించుకోవాలని తెలంగాణ ప్రాంత మంత్రులు కోరారు. ఏపీ ఎన్జీవోలు, సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణ మంత్రుల బృందం శుక్రవారం చర్చలకు ఆహ్వానించింది. అంతకు ముందు మంత్రి జానారెడ్డితో  సచివాలయంలో మంత్రులు గీతా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య సమావేశం అయ్యారు. మరోవైపు భారీ భద్రత మధ్య ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి సచివాలయానికి చేరుకున్నారు. మరోవైపు హైదరాబాద్ బ్రదర్స్ మంత్రులు దానం నాగేందర్, ముఖేష్లు సీఎంతో సమావేశం అయ్యారు. కాగా సీమాంధ్ర ఉద్యోగుల ర్యాలీలు, ఆందోళనల నేపథ్యంలో పోలీసులు సచివాలయానికి భారీగా భద్రత పెంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement