నేటి నుంచి 15 మధ్య ఒక విడత, 19–25 మధ్య మరో విడత
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామ, వార్డు సచివాలయాలతోపాటు అంగన్వాడీ కేంద్రాల్లో ఈ నెల 12–15 తేదీ మధ్య ఒక విడత, 19–25 తేదీల మధ్య మరో విడత ప్రత్యేక ఆధార్ క్యాంపుల నిర్వహణకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలో 15–17 ఏళ్ల మధ్య వయసు ఉండే 11.98 లక్షల మంది తమ ఆధార్లో యూఐడీఏఐ నిబంధనల ప్రకారం బయో మెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉందని, ఈ నేపథ్యంలో ప్రత్యేకించి ఆయా వయసు విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకునేలా ప్రాధాన్యత ఇస్తూ, కొత్తగా ఆధార్ నమోదుకు వీలు కలి్పస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


