'పయ్యావులపై చర్యలు తీసుకోండి' | TDP Leaders Distributes Money and liquor to Attract Voters in Aantapur district | Sakshi
Sakshi News home page

'పయ్యావులపై చర్యలు తీసుకోండి'

May 1 2014 8:37 AM | Updated on Aug 14 2018 5:54 PM

అనంతపురం జిల్లా ఉరవకొండలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుకున్నారు.

అనంతపురం జిల్లా ఉరవకొండలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుకున్నారు. ఓటర్లకు పంచేందుకు  టీడీపీ నేతలు తీసుకువెళ్తున్న రూ.30 లక్షల విలువైన మద్యాన్ని వైఎస్ఆర్ సీపీ నేతలు పట్టుకుని... పోలీసులకు అప్పగించారు.  పట్టుబడిన మద్యం టీడీపీ నేత పయ్యావుల కేశవ్ కు చెందినవని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పయ్యావులపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పోలీసులను డిమాండ్ చేశారు.

అలాగే తాడిపత్రిలో ఓటర్లకు ప్రలోభ పెట్టేందుకు టీడీపీ నాయకులు తీసుకువెళ్లున్న రూ.2 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం టీడీపీ నాయకులపై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement