ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై అధికార టీడీపీ దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి.
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై అధికార టీడీపీ దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా మొలకలచెరువు గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ మద్దతుదారులపై టీడీపీ నాయకులు హత్యాయత్నం చేశారు. కారుతో బైకును ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నించారు.
ఈ ఘటనలో మొలకలచెరువు సర్పంచ్ భర్త వెంకటరమణ, చంద్రమోహన్ అనే వ్యక్తి గాయపడ్డారు. తీవ్రగాయాపాలైన వీరిని కదిరి ఆస్పత్రికి తరలించారు. టీడీపీ నేత దేవేందర్ రెడ్డి వర్గీయులే దాడి చేశారని బాధితులు ఆరోపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.