కారుతో బైకును ఢీకొట్టి హత్యాయత్నం | tdp leaders attempt to murder on ysrcp workers in anantapur district | Sakshi
Sakshi News home page

కారుతో బైకును ఢీకొట్టి హత్యాయత్నం

Nov 20 2014 7:24 PM | Updated on Aug 10 2018 8:46 PM

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై అధికార టీడీపీ దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి.

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై అధికార టీడీపీ దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా మొలకలచెరువు గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ మద్దతుదారులపై టీడీపీ నాయకులు హత్యాయత్నం చేశారు. కారుతో బైకును ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నించారు.

ఈ ఘటనలో మొలకలచెరువు సర్పంచ్ భర్త వెంకటరమణ, చంద్రమోహన్ అనే వ్యక్తి గాయపడ్డారు. తీవ్రగాయాపాలైన వీరిని కదిరి ఆస్పత్రికి తరలించారు. టీడీపీ నేత దేవేందర్ రెడ్డి వర్గీయులే దాడి చేశారని బాధితులు ఆరోపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement