సాక్షి, న్యూఢిల్లీ: 1999 నాటి గ్రూప్–2 నోటిఫికేషన్ ద్వారా జరిగిన నియామకాల్లో స్థానిక రిజర్వేషన్ల అ మలు, ఇతర అంశాలపై 2015 ఫిబ్రవరి 2న తాము ఇచ్చిన తీర్పు అమలును విశదీకరించేందుకు ఈ అంశంతో సంబంధమున్న అధికారులను విచారణ కు పంపాలని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. 1999 గ్రూప్–2 నోటిఫికేషన్ వివాదంపై దాఖలైన కోర్టు ధిక్కారణ (కంటెప్ట్) పిటిషన్లను మంగళవారం జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్, జస్టిస్ ఇందూ మల్హోత్రాల ధర్మాసనం విచా రించింది. 1999లో ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన నోటి ఫికేషన్కు అనుగుణంగా తొలుత 113 మంది అభ్యర్థులను మెరిట్ ప్రాతిపదికన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీ సర్లుగా నియమించారు. అయితే మరో 973 పోస్టులు ఖాళీ ఉన్నా.. ఏపీపీఎస్సీకి తెలియపరచలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
హైకోర్టు ఉత్తర్వుల మేరకు 973 పోస్టులను కూడా తదుపరి మెరిట్ క్రమంలో భర్తీ చేశారు. అయితే 07.03.2002న ఇచ్చి న జీవో 124 ప్రకారం స్థానిక రిజర్వేషన్లను 1999 నోటిఫికేషన్లోని నియామక ప్రక్రియకు వర్తింపజే యడంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యా యి. వీటిపై విచారణ అనంతరం 2015 ఫిబ్రవరి 2 న సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించింది. 03.07.2002 న ఇచ్చిన జీవో 124ను 1999లో ఇచ్చిన నోటిఫికేషన్కు వర్తింపజేయలేమంది. అంటే 973 పోస్టులను 124 జీవోకు లోబడి నియమించాలని హైకోర్టు ఇ చ్చిన ఆదేశాలు సరికావంది. 1999లో నోటిఫికేషన్ ప్రకటన ఇచ్చే నాటికి అమలులో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే పోస్టులను భర్తీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అప్పటికే నియమితులైన 113 మంది, తర్వాత భర్తీ అయిన 973 మంది సీనియారిటీకి సంబంధించి నిబంధనలను అనుసరించి మెరిట్ను పరిగణనలోకి తీసుకుని సంబంధిత అథారిటీ నిర్ణయించాలని ఆదేశించింది. కానీ ఈ ఉత్తర్వులు అమలు కాలేదంటూ అభ్యర్థులు తిరిగి కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేశారు.
అధికారులను పంపండి: తాజాగా మంగళవారం ఈ పిటిషన్ను విచారించిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఎంతమంది ఈ నియామక ప్రక్రియలో నియమితులయ్యారన్నది తెలియాల్సి ఉం ది. అలాగే, సుప్రీంకోర్టు 2015 ఫిబ్రవరి 2న ఇచ్చిన తీర్పులోని పేరా 29లో, పేరా 31లో పొందుపరిచిన ఆదేశాలను ఏపీ, తెలంగాణ ఎలా అమలు పరిచా యన్నది తెలియాల్సి ఉంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జారీ అయిన జీవోను నోటిఫికేషన్కు వర్తిం పజేయలేమని సుప్రీంకోర్టు ఆదేశించినట్టయితే సెలె క్షన్ లిస్ట్ ఆ మేరకు తిరిగి రూపొందించాల్సి ఉం టుంది. కానీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు సంబంధిత అంశాలపై అఫిడవిట్లు ఫైల్ చేయలేదు. ఈ పరిస్థితుల్లో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల సంబంధిత కా ర్యదర్శులు, సాధారణ పరిపాలన విభాగం(జీఏడీ) ఇన్చార్జి దీనిపై అవగాహన ఉండి, కోర్టుకు విశదీక రించే అధికారులను తదుపరి విచారణకు పంపాల ని ఆదేశిస్తున్నాం. తీర్పులోని పేరా 29, పేరా 31ల లో పొందుపరిచిన అంశాలపై తీసుకున్న చర్యలను విశదీకరిస్తూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అఫిడవిట్లు సిద్ధంగా ఉంచుకోవాలి. లేకుంటే సంబంధిత కార్యదర్శులు మార్చి 3న విచారణ సమయంలో కోర్టులో ఉండాలి. లేదంటే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది..’అని ధర్మాసనం పేర్కొంది.
ఆ అధికారులు విచారణకు రావాలి..
Published Thu, Feb 27 2020 2:49 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement