Sakshi News home page

స్కూల్‌లో విద్యుత్ షాక్... విద్యార్థిని మృతి

Published Mon, Mar 16 2015 1:41 PM

student died with current shok in west godavari distirict

ఎలమంచిలి: పశ్చిమగోదావరి జిల్లా ఎలమంచిలి మండలం విలపకుర్రు హైస్కూల్లో విద్యుత్ షాక్‌కు గురై ఆరో తరగతి విద్యార్థిని మృతి చెందింది. చింతదిబ్బ గ్రామానికి చెందిన విద్యార్థిని మౌనిక సోమవారం ఉదయం స్కూల్ ఆవరణలోని నీటి ట్యాంక్ వద్దకు వెళ్లగా ఎర్త్‌వైర్ తగలడంతో విద్యుత్ షాక్‌కు గురైంది. స్థానికులు హుటాహుటిన ఆమెను పాలకొల్లులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

Advertisement

What’s your opinion

Advertisement