‘తుంగభద్ర’పై రెండు లిప్టు స్కీంలు ! | state government plans two lift irrigation schemes on tungabhadra | Sakshi
Sakshi News home page

‘తుంగభద్ర’పై రెండు లిప్టు స్కీంలు !

Nov 26 2013 12:42 AM | Updated on Sep 2 2017 12:58 AM

తుంగభద్ర నదిపై రెండు లిప్టు స్కీంలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సుమారు రూ. 31 కోట్లను విడుదల చేశారు.

సాక్షి, హైదరాబాద్: తుంగభద్ర నదిపై రెండు లిప్టు స్కీంలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సుమారు రూ. 31 కోట్లను విడుదల చేశారు. ఈ మేరకు సోమవారం సాగునీటి శాఖ ముఖ్యకార్యదర్శి బి. అరవిందరెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. కర్నూలు జిల్లా బెలగాల్ మండలం పరిధిలో తుంగభద్ర నదిపై కొత్తగా లిప్టు స్కీంను నిర్మించనున్నారు. ఇందుకోసం రూ. 23.42 కోట్లను విడుదల చేశారు. ఈ స్కీం ద్వారా సుమారు 2,270 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించనున్నారు. అలాగే ఇదే జిల్లాలో కౌతాలం పరిధిలో రూ. 8.58 కోట్లతో మరో లిప్టు స్కీంను నిర్మిస్తారు. దీన్ని ద్వారా 1,200 ఎకరాలకు సాగునీరు అందనుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement