మోడలింగ్ టూ సీరియల్స్.. | special chit chat tv artist singampalli sruthi | Sakshi
Sakshi News home page

మోడలింగ్ టూ సీరియల్స్..

Nov 15 2014 1:05 AM | Updated on Sep 2 2017 4:28 PM

మోడలింగ్ టూ సీరియల్స్..

మోడలింగ్ టూ సీరియల్స్..

‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాలో ప్రతినాయకి పాత్ర పోషించి మెప్పించిన నటి సింగంపల్లి శృతి. ...

‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాలో ప్రతినాయకి పాత్ర పోషించి మెప్పించిన నటి సింగంపల్లి శృతి. బుల్లితెరపై రుతురాగాలు, శ్రావణ సమీరాలు, మొగలిరేకుల్లో మహిళా   ప్రేక్షకుల్ని మెప్పించిన గొప్పనటి ఆమె. ఓ లఘుచిత్రంలో నటించేందుకు కౌతవరం వచ్చారు. మోడలింగ్ నుంచి సీరియల్స్ వరకు తన జీవన ప్రస్థానాన్ని ‘సాక్షి’కి వివరించారు.     
 - కౌతవరం (గుడ్లవల్లేరు)
 
సాక్షి : మీ స్వస్థలం?

శృతి : వైజాగ్ అయినా.. పాతికేళ్లుగా హైదరాబాద్‌లోనే స్థిరపడ్డాం.
 
సాక్షి : నటనలోకి ఎలా వచ్చారు.?

శృతి : ఫస్ట్ మోడలింగ్ చేసేదాన్ని. స్నేహితుల పరిచయాలతో నటనలోకి అడుగుపెట్టాను.
 
సాక్షి : మీ మొదటి సీరియల్?

శృతి : 1991లో ‘సీతారాముల సినిమా గోల’ అనే సీరియల్‌తో మొదలుపెట్టా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న 16ఏళ్ల వయసులోనే సీరియల్స్‌లోకి వచ్చేశా.

సాక్షి : మీకు పేరు తెచ్చిన సీరియల్స్..

శృతి : వందకుపైగా సీరియల్స్‌లో నటించా. రుతురాగాలు, చక్రవాకం, మొగలిరేకులు, చంద్రముఖి, కన్యాశుల్కం, శ్రావణ సమీరాలు, మమతల కోవెలలోని పాత్రలు మంచి పేరు తెచ్చారుు.

సాక్షి : సినిమాల సంగతేంటి?

శృతి : తొలి సినిమా అమ్మోరు. కెమెరామెన్ గంగతో రాంబాబు, కొత్తజంట, మీ శ్రేయోభాలాషి వంటి 30 సినిమాల్లో నటించా.
 
సాక్షి : మీ భర్త మధుసూదన్ కూడా నటుడే కదా..

శృతి : అవును. ‘ఆటోనగర్ సూర్య’ చిత్రంలో విలన్‌గా చేశారు. ‘ఒక లైలా కోసం..’ కూడా ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టింది. తమిళంలో ఆయన నటించిన ‘గోలీసోడ’ పెద్ద హిట్. ప్రస్తుతం వంశం, కిక్-2లో నటిస్తున్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement