కలెక్టరేట్, న్యూస్లైన్: జిల్లాలో పక్కా ఓటర్ల జాబితా ఖరారయ్యింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శుక్రవారం ఓటర్ల తుదిజాబితాను జిల్లా యంత్రాంగం విడుదల చేసింది. జాబితాను అన్ని గ్రామపంచాయతీలు, పోలింగ్బూత్లు, తహశీల్దారు కార్యాలయాలు, పోలీసు స్టేషన్లలో ప్రచురించిన నేపథ్యంలో ఓటరు లిస్టులో ఎవరి పేర్లున్నాయా లేదో సరిచూసుకోవచ్చు. ఈ జాబితా ప్రకారమే సాధారణ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కల్పించనున్నా రు. జిల్లా యంత్రాంగం రూపొందించిన ఈ జాబితాను ఎన్నికల సంఘానికి నివేదించా రు. దీని ప్రకారం జిల్లాలో ప్రస్తుతం 27,43,655 మంది ఓటర్లున్నారు. 2013 నవంబర్ 18 నాటి ముసాయిదా ఓటర్ల జాబితా నాటికి జిల్లాలో 2,64,0264 మంది ఓటర్లుండగా అనంతరం చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియలో 1,03,431 మంది అర్హులు జాబితాలో చేరారు. జనాభాప్రకారం 67శాతం ఓటర్ల నిష్పత్తికి అనుగుణంగా ఓటర్ల జాబితాను తయారు చే శారు. కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ నిరంతరం కొనసాగుతున్నా ఫిబ్రవరి 15 వరకు నమోదయ్యే ఓటర్లకు ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తారు.
తుదిజాబితా ప్రకారం
తుదిజాబితా ప్రకారం జిల్లాలో పురుష ఓటర్లే ఎక్కువగా ఉన్నా కొత్తగా చేరిన వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 6,999 ఎక్కువ మంది నమోదయ్యారు. గతేడాది నవంబర్ 18 నాటి ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలో 3,88,0041 మంది జనాభా ఉన్నారు. అందులో మహిళలు 19,47,556 మంది ఉండగా పురుషులు 19,32,485 మంది. అందులో పురుష ఓటర్లు 13,29,067, మహిళా ఓటర్లు 13,11,157 మంది ఉన్నారు. అనంతరం అదే తేదీ నాటి నుంచి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాయంత్రాంగం ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. గతేడాది నవంబర్ 18 నుంచి డిసెంబర్ 23 వరకు ఓటరు నమోదు ప్రక్రియలో సమర్పించిన దరఖాస్తుల్లో ఆక్షేపణలు, మార్పులు, చేర్పులను మొత్తంగా 1.64 లక్షల మంది నుంచి స్వీకరించారు. అందులో అధికార యంత్రాంగం నివేదిక ప్రకారం ఓటు కోసం నమోదు చేసుకున్నవారిలో 1,47,497 మంది ఉన్నారు.
అందులో పరిశీలన, విచారణ అనంతరం రెండు చోట్ల ఓటు నమోదైనవారితో పాటు మొత్తంగా 44066 మంది తిరస్కరణకు గురయ్యారు. కొత్తగా నమోదు చేసుకున్నవారిలో 1,03,431 మంది అర్హులుగా గుర్తించారు. 18-19 ఏళ్ల వయస్సు గల యువకులు కొత్తగా 72,086 మంది నమోదయ్యారు. ఇందులో యువకులు 44,582, యువతులు 27,504 మంది కొత్తగా నమోదయ్యారు. తుది జాబితా ప్రకారం జిల్లాలో ఓటర్ల సంఖ్య 27,43,655 మందికి చేరింది. అందులో మహిళా ఓటర్లు 13,67,372, పురుషులు 13,77283 మంది ఉన్నారు. వచ్చే ఎన్నికల కోసం జిల్లాలో 3393 పోలింగ్ బూత్ల ఏర్పాటును ఖరారు చేసారు.
పురుషాధిక్యం
Published Sat, Feb 1 2014 4:05 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement