ఆనందంతో గుండె ఆగి.. కార్మికుడి మృతి | rtc employee dies of heart attack in pulivendula | Sakshi
Sakshi News home page

ఆనందంతో గుండె ఆగి.. కార్మికుడి మృతి

May 13 2015 4:07 PM | Updated on Sep 3 2017 1:58 AM

ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్న విషయం తెలిసి.. ఆనందంతో గుండె ఆగి ఓ కార్మికుడు మరణించాడు.

ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్న విషయం తెలిసి.. ఆనందంతో గుండె ఆగి ఓ కార్మికుడు మరణించాడు. ఈ ఘటన వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో జరిగింది. ఆర్టీసీ కార్మికులకు.. మంత్రివర్గ ఉపసంఘానికి మధ్య జరిగిన చర్చలు సఫలం అయ్యాయని, 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వడం, గత మూడునెలల బకాయిలను దసరా, దీపావళి సమయంలో ఇస్తామనడం, పాత బకాయిలను రిటైర్మెంట్ సమయంలో అందిస్తామని ప్రకటించడంతో పులివెందులకు చెందిన నారాయణ అనే కార్మికుడు ఆనందం పట్టలేకపోయారు. అక్కడికక్కడే గుండె ఆగి మరణించారు.

Advertisement
 
Advertisement
Advertisement