ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు శివారులోని వెంగముక్కలపాలెం వద్ద ఆదివారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టి కాల్వలో పడింది
ప్రకాశం: ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు శివారులోని వెంగముక్కలపాలెం వద్ద ఆదివారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టి కాల్వలో పడింది. ఈ ప్రమాదంలో 40మందికి గాయలాయ్యాయి. బస్సు నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి తిరుపతి వెళుతుండగా వెనక నుంచి లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. బస్సులో దాదాపు 50మంది వరకు ప్రయాణీకులు ఉన్నారు. సంఘటనా స్థలానికి 108 సిబ్బంది చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.