తాంతియా కుమారి సంచలన వ్యాఖ్యలు | RTA commissioner Tantia Kumari sensational comments on IAS officers | Sakshi
Sakshi News home page

తాంతియా కుమారి సంచలన వ్యాఖ్యలు

Feb 15 2014 1:18 PM | Updated on Sep 27 2018 3:20 PM

తాంతియా కుమారి సంచలన వ్యాఖ్యలు - Sakshi

తాంతియా కుమారి సంచలన వ్యాఖ్యలు

సమాచార కమిషనర్ తాంతియా కుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

విజయవాడ : సమాచార కమిషనర్ తాంతియా కుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొందరు ఐఏఎస్ అధికారులు సిండికేట్లుగా ఏర్పడి సమాచార చట్టానికి తూట్లు పొడుస్తున్నారని ఆమె శనివారమిక్కడ అన్నారు. సమాచార హక్కు చట్ట పరిధిలోకి రాకుండా కొన్ని ఆర్థిక బిల్లులను అడ్డదారిలో ఆమోదింపచేయించుకుంటున్నారని తాంతియా కుమారి పేర్కొన్నారు. ఈ అడ్డగోలు వ్యవహారాన్ని న్యాయపరంగా అడ్డుకుంటామని ఆమె తెలిపారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని తాంతియా కుమారి వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement