అనంతలో రూ. కోటి విలువైన ఎర్రచందనం స్వాధీనం | Rs.1 crore worth Red Sandalwood seized in Tadipatri market yard | Sakshi
Sakshi News home page

అనంతలో రూ. కోటి విలువైన ఎర్రచందనం స్వాధీనం

May 8 2014 12:07 PM | Updated on Sep 2 2017 7:05 AM

అనంతపురం జిల్లా తాడిపత్రి మార్కెట్ యార్డ్లో భారీ లోడుతో ఉన్న ఎర్రచందనాన్ని పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు.

అనంతపురం జిల్లా తాడిపత్రి మార్కెట్ యార్డ్లో భారీ లోడుతో ఉన్న ఎర్రచందనాన్ని పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ లారీని పోలీసు స్టేషన్కు తరలించారు. ఎర్రచందనంతోపాటు లారీని సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ బహిరంగ మార్కెట్ లో రూ. కోటి ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఆగంతకులు  ఇచ్చిన సమాచారం మేరకు తాడిపత్రి మార్కెట్ యార్డ్లో సోదాలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. లారీ నెంబర్ ఆధారంగా యజమానులను గుర్తిస్తామని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement