13న అధిష్టానానికి నివేదిక | report to high command on 13th | Sakshi
Sakshi News home page

13న అధిష్టానానికి నివేదిక

Jan 6 2014 6:48 PM | Updated on Jul 12 2019 3:10 PM

రాష్ట్ర శాసన సభకు పోటీకి నిలిపే అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది.

హైదరాబాద్: రాష్ట్ర శాసన సభకు పోటీకి నిలిపే అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. ఏఐసిసి ప్రతినిధులు ముగ్గురు ఈరోజు ఇక్కడకు వచ్చారు. గాంధీభవన్లో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కలిశారు. శాసనసభతోపాటు లోక్సభ అభ్యర్థుల జాబితా ఖరారు చేసేందుకు వారు మల్లగుల్లాలు పడుతున్నారు.

అభ్యర్థుల ఎంపికపై ఏఐసిసి ప్రతినిధులు  నివేదిక రూపొందించి ఈనెల 13న అధిష్టానవర్గానికి ఇస్తారు. నివేదిక రూపొందించేందుకు ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement