కబడ్డీ పోటీలకు రంగంపేట విద్యార్థిని | Rangampeta student selected to Kabaddi competition | Sakshi
Sakshi News home page

కబడ్డీ పోటీలకు రంగంపేట విద్యార్థిని

Nov 14 2013 12:01 AM | Updated on Sep 2 2017 12:34 AM

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు రంగంపేట ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.వినోద ఎంపికైనట్టు ఆ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు ఎండీ గౌసొద్దీన్ తెలిపారు.

కొల్చారం, న్యూస్‌లైన్:  రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు రంగంపేట ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.వినోద ఎంపికైనట్టు ఆ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు ఎండీ గౌసొద్దీన్ తెలిపారు. మంగళవారం సంగారెడ్డిలో జరిగిన జిల్లాస్థాయి బాలికల కబడ్డీ పోటీలో వినోద ప్రతిభ కనబర్చడంతో రాష్ట్రస్థాయికి ఎంపికైనట్టు ఆయన పేర్కొన్నారు. ఈనెల 15న కృష్ణా జిల్లా గుడివాడలో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థినిని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement