ప్రొఫెసర్‌ లక్ష్మికి బెయిల్‌ మంజూరు | professor laxmi got bail on student harrasement case | Sakshi
Sakshi News home page

ప్రొఫెసర్‌ లక్ష్మికి బెయిల్‌ మంజూరు

Dec 15 2016 3:46 AM | Updated on Nov 6 2018 7:53 PM

గుంటూరు ప్రభుత్వ వైద్యశాల పీజీ వైద్య విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో నిందితురాలిగా ఉన్న ప్రొఫెసర్‌ వెన్నెలగంటి ఆది ఆంజనేయ లక్ష్మికి బెయిల్‌ మంజూరు...

గుంటూరు లీగల్‌: గుంటూరు ప్రభుత్వ వైద్యశాల పీజీ వైద్య విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో నిందితురాలిగా ఉన్న ప్రొఫెసర్‌ వెన్నెలగంటి ఆది ఆంజనేయ లక్ష్మికి బెయిల్‌ మంజూరు చేస్తూ మూడో అదనపు జిల్లా జడ్జి జి.గోపీచంద్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొఫెసర్‌ లక్ష్మికి పాస్‌పోర్టు ఉంటే దాన్ని సంబంధిత కోర్టులో అందజేయాలని న్యాయమూర్తి షరతు విధించారు. కేసు దర్యాప్తు పూర్తయిందని  చార్జిషీటు కూడా సంబంధిత కోర్టులో దాఖలు చేశారని, దీంతో పిటిషనర్‌కు బెయిల్‌ మంజూరు చేస్తున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement