అమ్మఒడి పేద విద్యార్థుల భవిష్యత్కి ఆనందాల ఒడి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు అన్నారు.
పేద విద్యార్థుల భవిష్యత్ కోసం ‘అమ్మఒడి’
Feb 9 2014 3:46 AM | Updated on May 25 2018 9:12 PM
బుట్టాయగూడెం, న్యూస్లైన్ : అమ్మఒడి పేద విద్యార్థుల భవిష్యత్కి ఆనందాల ఒడి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు అన్నారు. స్థానిక సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాన్ని శనివారం ఆయన సందర్శించి విద్యార్థులతో మమేకమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించేందుకు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఫీజురీయంబర్స్మెంట్ పథకాన్ని సక్రమంగా అమలు చేయకపోవడంతో పేద విద్యార్థుల చదువు మధ్యలో ఆగిపోయే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే పేద విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం అమ్మఒడి పథకంతోపాటు మరిన్ని పథకాలు అమలు చేస్తారని చెప్పారు. పార్టీ శ్రేణులు రేపాకుల చంద్రం, ఆరేటి సత్యనారాయణ, కోరం దుర్గారావు, అన్నవరం, కడియ్య పాల్గొన్నారు. తమకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఆదుకోవాలని కోరుతూ మండలంలోని వెలుతురువారిగూడెం గ్రామానికి చెందిన గిరిజనులు బాలరాజును కోరారు.
Advertisement


