'పోలవరం త్వరితగతిన పూర్తి చేయండి'

'పోలవరం త్వరితగతిన పూర్తి చేయండి' - Sakshi


పోలవరం ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని విశాఖపట్నం లోక్సభ సభ్యుడు కె.హరిబాబు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం విశాఖపట్నంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... కేంద్ర జలసంఘం ఆమోదించిన డిజైన్ మేరకే నిర్మాణం జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. పోలవరం డిజైన్పై ఎవరికైనా అనుమానాలుంటే కేంద్ర జల సంఘం దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పటికే రూ. 5200 కోట్లు ఖర్చు చేశారని ఆయన గుర్తు చేశారు. ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top