గోపాల్పూర్ వద్ద తీరాన్ని తాకిన పై-లీన్ తుపాను | Phailin cyclone touched shore | Sakshi
Sakshi News home page

గోపాల్పూర్ వద్ద తీరాన్ని తాకిన పై-లీన్ తుపాను

Oct 12 2013 6:36 PM | Updated on Sep 1 2017 11:36 PM

గోపాల్పూర్ వద్ద తీరాన్ని తాకిన  పై-లీన్ తుపాను

గోపాల్పూర్ వద్ద తీరాన్ని తాకిన పై-లీన్ తుపాను

గోపాల్పూర్ వద్ద పై-లీన్ తుపాను తీరాన్ని తాకింది.

భువనేశ్వర్: గోపాల్పూర్ వద్ద పై-లీన్ తుపాను  ఈ సాయంత్రం 6.25 గంటలకు తీరాన్ని తాకింది. తుపాను తీరం తాకినట్లు అమెరికా వాతావరణ శాఖ  ప్రకటించింది. ఆరు గంటల పాటు తుపాను తీవ్రత కొనసాగే అవకాశం ఉంది.  శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలో ఈదురుగాలులతో కూడి భారీ వర్షం కురుస్తోంది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

పై-లిన్ తుపాను వల్ల ఒడిషాలో కురుస్తున్న భారీ వర్షాలకు ముగ్గురు మృతి చెందారు. తుపాను ప్రభావం వల్ల ఒడిశా, ఉత్తరాంధ్రలలో రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement