పీలేరు, న్యూస్లైన్: పీలేరు ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నప్పుడు ప్రజల తాగునీటి ఎద్దడిని శాశ్వత ప్రాతిపదికన తీర్చేందుకు రూ. 2.17 కోట్లతో పట్టణ శివార్లలోని కొత్తపల్లె మార్గంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించారు. పింఛా ఏటి నీటితో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ను నింపి, ఆ నీటిని శుద్ధి చేసి పైప్లైన్ ద్వారా ఓవర్ హెడ్ ట్యాంక్లకు తరలించి, అక్కడి నుంచి ప్రజలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేశారు. వర్షాభావ పరిస్థితులు నెలకొంటే సమస్య ఉత్పన్నం కాకుండా ఉండేందుకు పింఛా ఏటిపై పీలేరు-సదుం మండలాల సరిహద్దు ప్రాంతంలోని బాలంవారిపల్లె సమీపంలో రూ.2 కోట్లతో గార్గేయ ప్రాజెక్టు నిర్మించారు. ఈ ప్రాజెక్టు నుంచి పైపులైన్ ద్వారా పీలేరు సమ్మర్స్టోరేజ్కి నీటిని తరలించి పట్టణ ప్రజలకు తాగునీరు, దాదాపు 5 వేల ఎకరాలకు కాలువల ద్వారా సాగునీరు అందించాలనేది ప్రధాన లక్ష్యం.
నిర్మాణ పనులు పూర్తైఐదేళ్లు కావస్తున్నా ఆ దిశగా ఎలాంటి పురోగతి కానరాలేదు. మరోవైపు కాలువల నిర్మాణం కోసం భూసేకరణ గతంలోనే పూర్తైది. ఉన్నతమైన ఆశయంతో పెద్దిరెడ్డి పీలేరు తాగునీటి సమస్య తీవ్రతను దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డికి వివరించి సమ్మర్స్టోరేజ్, గార్గేయ ప్రాజెక్టు నిర్మాణాలను పూర్తి చేశారు. దాదాపుగా తాగునీటి సమస్య పరిష్కారమవుతుందని అం దరూ సంబరపడ్డారు. అనంతరం నియోజకవర్గాల పునర్విభజనతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరుకు వెళ్లడంతో ఆశయం కార్యరూపం దాల్చలేదు.
మహానేత మరణానంతరం పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిరణ్కుమార్రెడ్డి మూడు సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సమ్మర్ స్టోరేజ్కి నీటి తరలింపు కోసం చేస్తున్న ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ నీటి ఎద్దడితో ప్రజలు అలమటించాల్సి వస్తోంది. ఆరునెలల కిందట మంచినీటి సమస్య జఠిలంగా మారడంతో ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో బోర్లు డ్రిల్ చేసినా అది ఫలప్రదం కాలేదు. దాహార్తి తీవ్రతను గుర్తించి రాజకీయాలకతీతంగా సమ్మర్ స్టోరేజ్కి ప్రాజెక్టు నుంచి పైప్లైన్ వేసి నీటిని తరలించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
నీళ్లున్నా.. గొంతు తడవదు !
Published Wed, Nov 6 2013 2:26 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
Advertisement