కారు, బైక్ ఢీ: ఒకరి మృతి | one died in a car - bike collision incident in krishna district | Sakshi
Sakshi News home page

కారు, బైక్ ఢీ: ఒకరి మృతి

Aug 8 2015 5:18 PM | Updated on Sep 3 2017 7:03 AM

బైక్‌ను కారు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు ప్రాణాలొదిలాడు.

కృష్ణా(ఇబ్రహీంపట్టణం): బైక్‌ను కారు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు ప్రాణాలొదిలాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్టణం మండలంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని దొనబండ గ్రామంలో 65 నంబరు జాతీయ రహదారిపై బైక్‌పై వెళుతున్న షేక్ జానీ(22)ను వెనక నుంచి కారు ఢీకొట్టింది. దీంతో జానీ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిది మండలంలోని జూపుడి గ్రామంగా పోలీసులు నిర్ధరించారు.

Advertisement
 
Advertisement
Advertisement