'స్పీకర్ తీరులో మార్పు వస్తుందని ఆశ' | No-confidence motion on speaker says jyothula nehru | Sakshi
Sakshi News home page

'స్పీకర్ తీరులో మార్పు వస్తుందని ఆశ'

Dec 28 2015 4:04 PM | Updated on Jul 29 2019 2:44 PM

'స్పీకర్ తీరులో మార్పు వస్తుందని ఆశ' - Sakshi

'స్పీకర్ తీరులో మార్పు వస్తుందని ఆశ'

తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు పై నోటీసులు ఇచ్చామని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు.

కాకినాడ: తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు పై నోటీసులు ఇచ్చామని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. పాలక పక్షానికి మద్దతుగా స్పీకర్ ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని తెలిపారు. మా అవిశ్వాస తీర్మానంతోనైనా స్పీకర్లో మార్పు వస్తుందని ఆశ పడుతున్నామన్నారు.
 
మా నోటీసుతో స్పీకర్ తీరు పై చర్చించే అవకాశం దొరుకుతుందని జ్యోతుల నెహ్రూ తెలిపారు. శాసన సభ వ్యవహారాలను ఎన్టీఆర్ భవన్కు తాకట్టు పెడుతున్నట్టుగా కనిపిస్తుందని మండిపడ్డారు. 

Advertisement
 
Advertisement
Advertisement