నేడు శేషాచలం అడవికి రానున్న రవి ఠాకూర్ | National ST commission chairman Ravi thakur will visit Seshachalam forest today | Sakshi
Sakshi News home page

నేడు శేషాచలం అడవికి రానున్న రవి ఠాకూర్

Apr 17 2015 9:06 AM | Updated on Sep 3 2017 12:25 AM

నేడు శేషాచల అడవికి జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ రవి ఠాకూర్ రానున్నారు.

తిరుపతి: నేడు శేషాచల అడవికి జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ రవి ఠాకూర్ రానున్నారు. ఉదయం చెన్నైలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశం కానున్నారు. సమావేశం అనంతరం ఆయన సాయంత్రం శేషాచలం ఎన్కౌంటర్ ఘటన ప్రాంతాన్ని పరిశీలిస్తారు.

శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో తమిళనాడుకు చెందిన కూలీలు మృతిచెందిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి శనివారం ఉదయం రవి ఠాకూర్ శేషాచలం ఎన్కౌంటర్ తీరుపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement