నీలమణిదుర్గ సన్నిధిలో సంగీత దర్శకుడు కోటి | Sakshi
Sakshi News home page

నీలమణిదుర్గ సన్నిధిలో సంగీత దర్శకుడు కోటి

Published Mon, Apr 9 2018 7:18 AM

Music Director Koti Visited Temple - Sakshi

పాతపట్నం : పాతపట్నం నీలమణిదుర్గ అమ్మవారిని సినీ సంగీత దర్శకుడు కోటి దంపతులు, సినీ నటుడు భానుచందర్‌ ఆదివారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ సిబ్బంది గౌరవ స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. అర్చకుడు రాజేష్‌ ఆచార్యులు అష్టోత్తర గోత్రాలతోపాటు, కుంకుమపూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ అక్కందర సన్యాసిరావు, ఈవో డకర రమణయ్య, మోహనరావు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement