ఎంపీ కొత్తపల్లి గీతను నిలదీసిన వైఎస్సార్‌సీపీ నేతలు | mp kottapalli geetha was asked by ysrcp leaders | Sakshi
Sakshi News home page

ఎంపీ కొత్తపల్లి గీతను నిలదీసిన వైఎస్సార్‌సీపీ నేతలు

Mar 6 2015 10:13 PM | Updated on May 29 2018 4:18 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచి, పార్టీ వల్ల గెలవలేదని చెప్పడం ఎంతవరకు న్యాయం’’ అంటూ వైఎస్సార్‌సీపీ అరకు ఎంపీ కొత్తపల్లి గీతను పార్టీ నేతలు, కార్యకర్తలు నిలదీశారు.

విజయనగరం: ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచి, పార్టీ వల్ల గెలవలేదని చెప్పడం ఎంతవరకు న్యాయం’’ అంటూ వైఎస్సార్‌సీపీ అరకు ఎంపీ కొత్తపల్లి గీతను పార్టీ నేతలు, కార్యకర్తలు నిలదీశారు. ఈ ఘటన అరకు లోక్‌సభ పరిధిలోని విజయనగరం జిల్లా కురుపాంలో శుక్రవారం జరిగింది. అభివృద్ధి పనులపై జరిగిన సమీక్షా సమావేశానికి గీత హాజరయ్యారు. దీనికి అధికారులతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యురాలు ఎస్.పద్మావతి, ఎంపీపీ, కార్యకర్తలు హాజరయ్యారు.

 

ఈ సందర్భంగానే ఎంపీ గీత వ్యవహార శైలిపై నేతలు, కార్యకర్తలు నిలదీశారు. దీంతో గీత దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఎలాంటి బదులివ్వకుండా మౌనంగా ఉండిపోయారు. ఎంపీకి ప్రజలే తగిన సమాధానం చెబుతారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement