‘మంత్రిగారూ ! ఆ అధికారి ఎన్నికల్లో టీడీపీకి సహకరించలేదు. మరో ఆయన మేం చెప్పినా బొత్తిగా పట్టించుకోవడం లేదు..సీఐలతో కూడా బాగా ఇబ్బందిగా ఉంది. వీరందరినీ కచ్చితంగా బదిలీ చేయాల్సిందే! వారి స్థానంలో మనకు అనుకూలంగా ఉన్న వారిని తీసుకుందాం! ఇందా జాబితా!’ - ఇటీవల మంత్రి బొజ్జలతో టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలివి.
సాక్షి, చిత్తూరు : పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చాం...రానున్న ఐదేళ్లలో టీడీపీ కార్యకర్తలకు లాభం జరగాలన్నా... తాము చెప్పిట్లుగా పనులు జరగాలన్నా...తాము ఏం చెబితే ఆ మాటకు ‘జీహుజూర్...!’ అనే అధికారులు కావాలి. చెప్పి న ప్రతిపనికీ ‘రూల్స్ అండ్ రెగ్యులేషన్స్’ అని తమ మాట వినని అధికారులు వద్దని టీడీపీ నేతలు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి స్పష్టం చేశారు. ప్రస్తుతం బదిలీపై నిషే ధం ఎత్తివేస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు అక్టోబర్ 10వ తేదీ వరకూ అమలులో ఉంటాయి. ఆపై నిషేధం తిరిగి అమల్లోకి రానుంది.
దీంతో పుణ్యకాలం ముగిసేలోపు తమ దారికిరాని అధికారులపై బదిలీ వేటువేసి, అనుకూలురైన అధికారులను రప్పించుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా అధికారులతో పాటు జిల్లావ్యాప్తంగా ఎక్కడ ఏ అధికారి తమకు అవసరం లేదో వారి జాబితాను సిద్ధంచేసి, ఈ నెల 25న చిత్తూరుకు వచ్చిన అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి సమర్పించారు.
ఈ జాబితాలో డీఈవో ప్రతాప్రెడ్డి, డీటీసీ బసిరెడ్డి, చిత్తూరు ఆర్డీవో పెంచలకిషోర్తోపాటు మరికొందరి అధికారుల పేర్లు ఉన్నట్లు తెలిసింది. వీరితో పాటు సీఐలు రాజశేఖర్, రవిమనోహర్, అల్లాబక్ష్ స్థానంలో కూడా కొత్తవారిని నియమించాలని సూచించినట్లు సమాచారం. అలాగే చిత్తూరు డీఎస్పీ కమలాకర్రెడ్డి బదిలీ తర్వాత ఆ పోస్టు ఖాళీగా ఉంది. ఈ పోస్టుకు రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసులునాయుడు నియమించాలని కూడా వారు తెలిపినట్లు తెలుస్తోంది. ఇదేక్రమంలో జిల్లా వ్యాప్తంగా డీఎస్పీలు, సీఐల జాబితాను సిద్ధంచేసి మంత్రికి అందించారు.
వైఎస్సార్సీపీ ఎంపీపీలున్నచోట ఎంపీడీవోల నియామకంపై ప్రత్యేక దృష్టి
జిల్లా వ్యాప్తంగా 65 మండలాల్లోని ఎంపీడీవోల్లో ఎవరు తమకు అవసరం, ఎవరు అవసరం లేదనే జాబితాను కూడా టీడీపీ నేతలు మంత్రికి అందించారు. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న 22 చోట్ల ఎంపీడీవోల నియామకంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మండలాల్లో టీడీపీ నేతలు చెప్పినట్లుగా నడుకునే ఎంపీడీవోలను నియమించేలా 22 మందితో జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో తహశీల్దార్లకు కూడా స్థానచలనం కల్పించాలని సూచించినట్లు తెలిసింది.
కమిషనర్ బదిలీపై మేయర్ గట్టి పట్టు
చిత్తూరు కమిషనర్ రాజేంద్రప్రసాద్ను కచ్చితంగా బదిలీ చేయాలని మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త గట్టిగా పట్టుపట్టారు. ప్రస్తుతం వీరు ఉప్పనిప్పుగా కార్పొరేషన్లో కొనసాగుతున్నారు. దీంతో ఆ స్థానంలో కడప కమిషనర్ ఓబులేసుతో పాటు హైదరాబాద్ డీఎం ఆఫీసులో పనిచేస్తున్న ఈశ్వరయ్యలో ఒకరిని రప్పించుకునేందుకు మేయర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సయోధ్యలేని చోట పనిచేయడం కంటే బదిలీనే మేలనే యోచనలో కమిషనర్ ఉన్నారు.
జెడ్పీ సీఈవో బదిలీపై వీడని పీటముడి
జెడ్పీ సీఈవో వేణుగోపాలరెడ్డి బదిలీపై ఇంకా సందిగ్ధత వీడలేదు. జెడ్పీ పాలకవర్గం ఏర్పడిన తొలినాళ్లలో సీఈవో బదిలీ ఇక అనివార్యమే అని అంతా భావించారు. అయితే తర్వాత ఆ ప్రచారానికి బ్రేక్ పడింది. ప్రస్తుతం టీడీపీలోని ఓ వర్గం సీఈవోను బదిలీ చేయాలని ప్రయత్నిస్తుంటే, జెడ్పీ చైర్మన్, ఆమె భర్త చంద్రప్రకాశ్ మాత్రం సీఈవోకు అండగా నిలుస్తున్నారని తెలుస్తోంది. దీంతో సీఈవో బదిలీ గండం నుంచి బయటపడ్డట్లే!
మంత్రిగారూ...వాళ్లొద్దండీ
Published Sun, Sep 28 2014 4:07 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
ది లీడర్..!
టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు
షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం
ఇండోనేషియాలో భారీ వరదలు.. 14 మంది మృతి!
కాంగ్రెస్ అంతిమ దశకు చేరుకుంది: జ్యోతిరాదిత్య సింధియా
చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
వయ్యారి భామ నీ కళ్లు చూస్తే.. రేరాజైనా కుళ్లుకోవాల్సిందే! (ఫోటోలు)
మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement