ప్రత్యేక హోదాపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖమంత్రి మాణిక్యాలరావు అన్నారు.
చెన్నై: ప్రత్యేక హోదాపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖమంత్రి మాణిక్యాలరావు అన్నారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై చట్టపరమైన ఇబ్బందులున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఆర్థికంగా సహకరిస్తుందని మాణిక్యాలరావు పేర్కొన్నారు. కాగా ఏపీకి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు బుధవారం రాజ్యసభలో ప్రయివేట్ బిల్లు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.