ప్రజలు తన్నడానికి సిద్ధంగా ఉన్నారు: అయ్యన్న | Minister ayyannapatrudu comments on Land scam | Sakshi
Sakshi News home page

ప్రజలు తన్నడానికి సిద్ధంగా ఉన్నారు: అయ్యన్న

Jun 4 2017 2:01 AM | Updated on Sep 5 2017 12:44 PM

ప్రజలు తన్నడానికి సిద్ధంగా ఉన్నారు: అయ్యన్న

ప్రజలు తన్నడానికి సిద్ధంగా ఉన్నారు: అయ్యన్న

భూ దోపిడీదారులను విశాఖ ప్రజలు తరిమి తరిమి తన్నేందుకు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.

నర్సీపట్నం: భూ దోపిడీదారులను విశాఖ ప్రజలు తరిమి తరిమి తన్నేందుకు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. తాను నిజాన్ని నిర్భయంగా చెపుతానని, మంత్రి పదవినైనా వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో శనివారం జరిగిన నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న మంత్రి అయ్యన్న.. విశాఖ నగరంలో జరిగిన భూ కుంభకోణంపై స్పందించారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానని, దీనిపై తనకు ఎటువంటి నష్టం జరిగినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement