* ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన
* వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆరోపణ
పీలేరు : వైద్యులు ఆపరేషన్ చేసిన తరువాత మగబిడ్డను ప్రసవించిన కొంతసేపట్లోనే బాలింత మృతి చెందింది. పీలేరు పట్టణంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి గురువారం రాత్రి కాన్పుకోసం గర్భిణి రాగా, రాత్రి 10-45 గంటల ప్రాంతంలో ఆమెకు వైద్యులు ఆపరేషన్ చేశారు. మగ బిడ్డను ప్రసవించిన ఆమె మరికొన్ని గంటల్లోనే మరణించింది. దీనిపై ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు.
బాదితుల కథనం మేరకు కేవీపల్లె మండలం గువ్వలగుడ్డం గ్రామానికి చెందిన సీ. సుధాకర్రెడ్డి వాల్మీకిపురంలో ట్రాన్స్కోలో లైన్మన్గా పనిచేస్తున్నాడు. పీలేరు పట్టణం కావలిపల్లెలో కాపురం ఉంటున్నారు. సుధాకర్రెడ్డి భార్య కుమారి(30)ని కాన్పు కోసం గురువారం రాత్రి 10 గంటల సమయంలో పట్టణంలోని గుప్త ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు రాత్రి 10.45 గంటలకు ఆపరేషన్ చేసి మగ బిడ్డను బయటకు తీశారు.
అనంతరం రాత్రి సుమారు 1.30 గంటల సమయంలో బ్లీడింగ్ ఎక్కువగా ఉందని ఆమె భర్తకు చెప్పారు. ఆస్పత్రి యాజమాన్యమే అంబులెన్స్లో తిరుపతిలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి పంపించారు. అక్కడికెళ్లగానే పరీక్షించిన డాక్టర్లు ఆమె మృతి చెందిందని చెప్పారు. దాంతో ఆమె బంధువులు,కుటుంబసభ్యులు పీలేరు ఆస్పత్రి వద్దకు చేరుకుని శుక్రవారం ఆందోళనకు దిగారు. ఆపరేషన్లో తేడా రావడంవల్లే ఆమె చనిపోయిందని, ఆ విషయం బయటకు పొక్కనీయకుండా హడావుడిగా తిరుపతికి పంపేశారని ఆరోపించారు.
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రిపై దాడికి యత్నించారు. ఆందోళనకారులు, ఆస్పత్రి యాజమాన్యంతో పోలీసులు, ఇతర పెద్దలు చర్చించి గొడవను సద్దుమణిచారు. మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి పంపేశారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఆస్పత్రి వద్ద ఆందోళన, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తీవ్ర రక్తస్రావంతోనే మృతి
రిస్క్ కేసు అయినందున ఆపరేషన్ కేసి ఉండకూడ దు. ఈ కేసును మెటర్నటీ, సీఎంసీకి రెఫర్ చేసి ఉండాలి. సాహసం చేసి ఆపరేషన్ చేసి గర్భసంచి తొలగిం చారు. రక్తస్రావం ఎక్కువ కావడంతో ఆమె మృతి చెందింది. సంఘటనపై ప్రాథమిక విచారణ చేసి నివేదికను జిల్లా కలెక్టర్, డీఎంఅండ్హెచ్వోకు అందజేస్తాను. మృతురాలి బంధువులు, డాక్టర్, నర్సులను విచారించాల్సి ఉంది.
- అడిషనల్ డీఎంఅండ్హెచ్వో వెంకటప్రసాద్
పీలేరులో బాలింత మృతి
Published Sat, Jul 2 2016 2:56 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement