విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం గ్రామ ఉప సర్పంచిని మావోయిస్టులు అపహరించారు.
విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం గ్రామ ఉప సర్పంచిని మావోయిస్టులు అపహరించారు. బుధవారం అర్థరాత్రి గ్రామంలోకి ప్రవేశించిన కొందరు మావోయిస్టులు ఉప సర్పంచి వంటల ధనుంజయ్, అతని సోదరుడు సాక్షరభారత్ కోఆర్డినేటర్ నీలకంఠంను తమతో తీసుకెళ్లారు. గురువారం మధ్యాహ్నం వరకు వారి ఆచూకీ తెలియ రాలేదు.