ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య | Man commits suicide | Sakshi
Sakshi News home page

ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

Apr 20 2016 12:14 AM | Updated on Oct 9 2018 5:43 PM

ఉరివేసుకుని ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. వేములూరు శివారు దొరయ్య

కొవ్వూరు : ఉరివేసుకుని ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం..  వేములూరు శివారు దొరయ్య చెరువు కాలనీకి చెందిన దౌలూరి విజయ్(25) వృత్తిరీత్యా పెయింటర్. అతనికి 2013లో దుర్గతో పెళ్లైంది. ఈ ఏడాది సంక్రాంతి తర్వాత నుంచి అతను పనికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటున్నాడు. భార్య పనికి వెళ్లమని చెప్పినా ఏదో ఆలోచిస్తూ ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం దుర్గ పొరుగూరు వెళ్లింది. మంగళవారం తిరిగి వచ్చి చూసేసరికి విజయ్ ఇంట్లో ఫ్యాన్‌కి ఉరివేసుకుని మృతిచెంది ఉన్నాడు. దుర్గ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎస్.ఎస్.ఎస్.పవన్‌కుమార్ తెలిపారు. కుటుంబ కలహాలే కారణంగా తెలుస్తోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement