
'అంతా ఆత్మస్తుతి పరనింద'
ఆత్మస్తుతి పరనిందలా టీడీపీ మహానాడు జరిగిందని వెస్సార్సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ అన్నారు
హైదరాబాద్: ఆత్మస్తుతి పరనిందలా టీడీపీ మహానాడు జరిగిందని వెస్సార్సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ అన్నారు. ఈ మహానాడులో వారి మాటలు గమనిస్తే టీడీపీ వదిలిపెట్టి వెళ్లే నాయకులను, కార్యకర్తలను నిలబెట్టుకోవాలనే తాపత్రయం కనిపించిందని చెప్పారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా.. ఊకదంపుడు ఉపన్యాసాలతో ముగించారని విమర్శించారు. ప్రతిపక్షాన్ని విమర్శించడమే మహానాడు ఉద్దేశమా అని ఆయన ప్రశ్నించారు. ఏపీలో మహానాడు పెడితే ప్రజలు తిరగబడతారని హైదరాబాద్లో పెట్టారని ఎద్దేవా చేశారు.