పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట | Lovers seek police protection | Sakshi
Sakshi News home page

పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట

Aug 8 2014 1:16 AM | Updated on Sep 17 2018 6:18 PM

పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట - Sakshi

పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట

ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట తమకు రక్షణ కల్పించాలంటూ గురువారం కొయ్యలగూడెం పోలీసులను ఆశ్రయించింది. ఎస్సై గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం కొయ్యలగూడెం

కొయ్యలగూడెం : ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట తమకు రక్షణ కల్పించాలంటూ గురువారం కొయ్యలగూడెం పోలీసులను ఆశ్రయించింది. ఎస్సై గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం కొయ్యలగూడెం మండలం కన్నాపురానికి చెందిన పెరువిజ్జు వీరవెంకటసత్యనారాయణ, ఇదే గ్రామానికి చెందిన చిట్రోజు దుర్గాదేవి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ డిగ్రీ పూర్తి చేశారని, ఈ నెల 6న ద్వారకాతిరుమలలో శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నట్టు తెలిపారని ఎస్సై చెప్పారు. పెద్దల నుంచి రక్షణ కల్పించాలంటూ తమను ఆశ్రయించారన్నారు. ఇరు కుటుంబాల పెద్దలతో మాట్లాడి సమస్యను పరిష్కరించనున్నట్టు పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement