
సాక్షి, బుట్టాయగూడెం: లాక్డౌన్ నేపథ్యంలో మారుమూల కొండ ప్రాంతాల్లో గిరిజనుల యోగ క్షేమాలు తెలుసుకునేందుకు, వారికి స్వయంగా సహాయం అందించేందుకు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 15 రోజులుగా కొండ కోనల్లో బైకుపై ఆయన ప్రయాణిస్తున్నారు. శనివారం దొరమామిడి, అచ్చియ్యపాలెంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేశారు.