సమైక్యాంధ్ర జేఏసీ సమన్వయకర్తగా లక్ష్మణరెడ్డి | Lakshmana Reddy elected as coordinator | Sakshi
Sakshi News home page

సమైక్యాంధ్ర జేఏసీ సమన్వయకర్తగా లక్ష్మణరెడ్డి

Sep 17 2013 6:49 PM | Updated on Sep 1 2017 10:48 PM

సమైక్యాంధ్ర జేఏసీ సమన్వయకర్తగా జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి ఎంపికయ్యారు.

హైదరాబాద్: సమైక్యాంధ్ర జేఏసీ సమన్వయకర్తగా జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి ఎంపికయ్యారు. సమైక్య రాష్ట్రం కోసం జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సమావేశం ఈరోజు ఇక్కడ జరిగింది. ఈ సమావేశంలో  రిటైర్డ్‌ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ లక్ష్మణ రెడ్డి, డి.గోపాలకృష్ణ, ఎన్‌యూ మాజీ వీసీ వేణుగోపాల్‌రెడ్డి, ఆర్థిక నిపుణుడు ఎం.ఎల్‌.కాంతారావు, ఏపీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు పూర్ణచంద్రరావు, ప్రముఖ వైద్యులు పద్మాచౌదరి, వ్యవసాయరంగ నిపుణులు అక్కినేని భవానీప్రసాద్‌ పలువురు నిపుణులు, విద్యార్థి సంఘ నేతలు హాజరయ్యారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఈ సమావేశం డిమాండ్ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement