సీఎం, బొత్సతో భేటీ కానున్న సీమాంధ్ర నేతలు | Kirankumar reddy, Botsa satyanarayana to hold Telangana talks separately today | Sakshi
Sakshi News home page

సీఎం, బొత్సతో భేటీ కానున్న సీమాంధ్ర నేతలు

Nov 4 2013 10:18 AM | Updated on Jul 29 2019 5:31 PM

రాష్ట్ర విభజన ప్రక్రియ వేగం పుంజుకున్న నేపధ్యంలో సీమాంధ్ర కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు సోమవారం సాయంత్రం సమావేశమవుతున్నారు.

హైదరాబాద్ : రాష్ట్ర విభజన ప్రక్రియ వేగం పుంజుకున్న నేపధ్యంలో సీమాంధ్ర కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు  సోమవారం సాయంత్రం సమావేశమవుతున్నారు.  సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సమక్షంలో జరిగే ఈ భేటీలో సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు.

విభజనతో ముడిపడిన 11 కీలక అంశాలపై పార్టీల అభిప్రాయాలు చెప్పాలంటూ గ్రూప్ ఆఫ్‌ మినిస్టర్స్‌ కోరిన నేపధ్యంలో ఈ సమావేశం జరుగుతుండడం ప్రాధాన్యత  సంతరించుకుంది. కేంద్ర హోం శాఖ అఖిల పక్ష భేటీ ఏర్పాటు చేసిన అంశంపై అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈ భేటీలో ఖరారు చేయనున్నారు. దీనిపై ఎలా స్పందించాలనేది  కిరణ్, బొత్సలే నిర్ణయం తీసుకుంటారని నేతలంటున్నారు. మరోవైపు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా బొత్స సత్యనారాయణతో సమావేశం అవుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement