అడవుల్లో దొంగలదే రాజ్యం | kingdom of thieves in forests | Sakshi
Sakshi News home page

అడవుల్లో దొంగలదే రాజ్యం

Dec 24 2013 11:56 PM | Updated on Aug 15 2018 7:35 PM

నారాయణఖేడ్ ఫారెస్టు రేంజ్ పరిధిలో 6,900 హెక్టార్ల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది.

నారాయణఖేడ్ ఫారెస్టు రేంజ్ పరిధిలో 6,900 హెక్టార్ల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. దీని పరిధిలో 13 బీట్లు, నాలుగు సెక్షన్లు ఉన్నాయి. అయితే ఇద్దరు బీట్ ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కల్హేర్ మండలం నాగధర్, కడ్పల్, ఖాజాపూర్, కృష్ణాపూర్, బాచేపల్లి, మునిగెపల్లి, రాపర్తి, కల్హేర్ ప్రాంతాల్లో అక్రమార్కులు చెట్లను నరికి దుంగలను తరలిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో అటవీ సంపద రోజురోజుకూ తగ్గిపోతోంది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన అధికారులనే బెదిరిస్తున్నట్టు సమాచారం.
 మూడేళ్ల క్రితం బీట్ ఆఫీసర్ హత్య..
 కల్హేర్ మండలం నాగధర్-కడ్పల్ అటవీ క్షేత్రంలో మూడేళ్ల క్రితం సంజీవన్‌రావుపేట ఫారెస్టు బీట్ అధికారి శివలాల్ నాయక్‌ను అతని బైక్‌తో సహా కలప దొంగలు సజీవ దహనం చేశారు. అప్పట్లో ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి విధులు నిర్వహించాలంటే అధికారులు, సిబ్బంది భయపడుతున్నారు. ఆయుధాలు ఉంటేనే అడవిలోకి వెళ్తామంటున్నారు. ఆయుధాలు ఇస్తామని ప్రభుత్వం హమీ ఇచ్చినా ఇంతవరకు ఆచరణలోకి రాలేదు. శేషాచలం ఘటనతోనైనా ప్రభుత్వం తేరుకొని అధికారులకు, సిబ్బందికి రక్షణ కల్పించాలని ఆయా ప్రాంత వాసులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement